ఎర్రని వడ్లు పండే పొలాలలో కలుపు మొక్కలుగా భావించి తామర పుష్పాలను రైతులు లాగి దూరంగా విసరి వేశారు. ఆ పద్మాలలోని శంఖాలనుండి పుట్టిన ముత్యాలు ఆ రైతుల చేతుల నుండి జాలువారుతున్నాయి. పద్మ నిధి అనే మహానిధిని కలిగిన దేవతల వలె ఆ రైతులు విరాజిల్లుతున్నారు.
అనువాదం: ఆచార్య శ్రీపాద జయప్రకాశ్, తిరుప్పది