కోసేవన్నీ సెంజాలి వడ్లుగా ఉండడం కారణంగా తాయనార్ కుటుంబానికి తమకంటూ తినడానికి వడ్లు లేకపోయింది. ఇక చేయడానికి గత్యంతరం లేక తాయనార్ భార్య తమ ఇంటి పెరటిలో పెరిగిన ఆకులను కోసుకొని వచ్చి దానిని వండి భర్తకు వడ్డించింది. తాయనారు కూడా దానిని ఆరగించాడు. ఈ విధంగా దంపతులిరువురూ పరమేశ్వరునికి సేవ చేయడంలో ఎలాంటి లోపము రానివ్వక భక్తితో నిర్వహిస్తూ వచ్చారు.
అనువాదం: ఆచార్య శ్రీపాద జయప్రకాశ్, తిరుప్పది