తాయనార్ వరిపైరు కోయడానికి వెళ్లే పొలాలన్నింటినీ వెన్నులు వాలి బాగా పండిన సెంజాలి వరి పొలాలుగా పరమేశ్వరుడు మార్చివేశాడు. దానిని చూసి తాయనార్ అత్యంత సంతోషంతో తాను కూలిచేసి సంపాదించిన సెంజాలి వడ్లనన్నింటినీ ప్రసాదంగా వండి 'ఇది ఈ భక్తుడు చేసిన పుణ్యం' అని భావించి దానిని పరమేశ్వరునికి నైవేద్యంగా సమర్పించాడు.
అనువాదం: ఆచార్య శ్రీపాద జయప్రకాశ్, తిరుప్పది