నారాయణుడు లక్ష్మీ సమేతుడై ఎర్రని తామర పుష్పముపై అమరియుండ,
వారి పాదములు, తలభాగము ప్రధాన కేంద్రములుగా ఎంచి, తమలో ఎవరు గొప్పో ప్రదర్శించదలచి,
బ్రహ్మ పాతాలమువైపుకు ఒక వరాహ రూపమున ముందుకు పోగా, నా మనసును దోచిన ఆ పరమశివుడు ఆకాశమువైపుకు ఒక హంసవలే బహుదూరము పయనించాడు.
ఇతడు ఖచ్చితంగా బ్రహ్మపురమున వెలసి, విశాలమైన నుదురుగల స్త్రీలు మొదలుకొని,
ప్రపంచమున గల జీవులందరూ తనను ఆరాధించ గోరే ఆ పరంధాముడే.!
[ అనువాదము: సశికళ దివాకర్,2009]